Lakshmi Kataksham : అఖండ ధన లాభం కలిగించే 5 పరిహారాలు..

Lakshmi Kataksham :  ధనదాయక మహిమలను గురించి చెప్పడం జరిగింది. వీటినే అఖండ ధన లాభం కలిగించే పరిహారాలు అనే పేరుతో పిలుస్తారు వాటిలో ముఖ్యమైనది. శంఖం పరిహారం ఆ పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక శంఖంలో నీళ్లు పోసి ఆ శంఖంలో పోసిన నీళ్లు మీ ఇంట్లో తులసి కోటలో పోసి నమస్కారం చేసుకోండి. ధన లాభం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉంటే ఆ విగ్రహానికి రోజు శంఖ జలంతో కడిగి ఆ తర్వాత పూజ చేసుకోండి. లక్ష్మీ కటాక్షం వల్ల ధన లాభం కలుగుతుంది. అలాగే పార్వతీదేవి రావణాసురుడికి రెండు శక్తివంతమైనటువంటి పరిహారాలు చెప్పింది రావణాసురుడు ఆ పరిహారాలు తన భార్య అయినటువంటి మండోదరికి చెప్పాడు. ఆ పరిహారాల్లో మొట్టమొదటి పరిహారమేంటంటే ఎప్పుడైనా సరే మృగశిర నక్షత్రం ఉన్న రోజు అరటి చెట్టు ఆకు తెచ్చుకోవాలి. అరటి చెట్టు ఆకు తెచ్చుకొని ఆ ఆకుని ఒక చిన్న ముక్క కత్తిరించి ఆ ముక్కని పసుపు రంగు వస్త్రంలో చుట్టి మన శరీరం మీద ధరించాలి. అలా ధరిస్తే విపరీతమైనటువంటి ధన లాభం కలుగుతుంది. అంటే అరటి చెట్టు ఆకుని కత్తిరిచ్చి పసుపు రంగు వస్త్రలో చుట్టి దాన్ని ఒక తాయత్తులో పెట్టుకొని ఆ తాయత్తు మన కుడి భుజానికి ధరించిన నడుముకు ధరించిన అద్భుతమైన ధనలాభము కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని రావణాసురుడు తన భార్య అయిన మండోదరికి చెప్పాడు.

అలాగే పార్వతీదేవి రావణాసురుడికి చెప్పిన ఇంకొక శక్తివంతమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే భరణి నక్షత్రం ఉన్న రోజు దర్భ ఇంటికి తెచ్చుకోవాలి. అంటే గ్రహణం వచ్చినప్పుడు పచ్చళ్ళు పాడవకుండా మనం దర్భలు వేస్తూ ఉంటాం. అలాంటి దర్పని ఎప్పుడు తెచ్చుకోవాలంటే భరణి నక్షత్రం ఉన్నరో తెలుసుకోవాలి. ఆ దర్బను భరణి నక్షత్రం ఉన్నరో తెచ్చుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ పూజ గదిలో పెట్టి ధూపమేయ్యాలి. మీ పూజ గదిలో ఆ మూట అలాగే ఉండాలి. దానివల్ల విపరీతమైన ధన లాభం కలుగుతుంది అప్పులు తీరిపోతాయి. ఖర్చులు తగ్గిపోతాయి ఆర్థిక వనరులు పెరుగుతాయి.

lakshmi kataksham remedies in telugu
lakshmi kataksham remedies in telugu

ఈ విషయం స్వయంగా రావణాసురుడు మండోదరికి చెప్పాడని రహస్యతాం త్రిక పరిహార శాస్త్రాల్లో చెప్పారు. అలాగే పరిహార శాస్త్రంలోని శక్తివంతమైన పరిహారం నల్ల బియ్యం పరిహారం. బియ్యం లో నల్ల బియ్యం అని ఉంటాయి. ఆ నల్ల బియ్యం కొన్ని తెచ్చుకొని మీరు ధనం దాచుకునే చోట దాచిపెట్టుకోవాలి. చిన్న పొట్లంలా కట్టుకొని నల్లబియ్యం ధనం దాచుకునే చోట దాచి పెట్టుకుంటే. విపరీతంగా ధన లాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి అప్పులు తగ్గిపోతాయి. అలాగే మనకి నాగకేసరాలు నుండి చాలా శక్తివంతమైనవి. ఆ నాగకేసరాలు కొన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకున్న కూడా ధనపరంగా అదృష్టం బాగా కలిసొస్తుంది. ఇవన్నీ కూడా రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది.

అలాగే ఎంత శ్రమ పడుతున్నా సరే ఇంట్లో ధన నిలకడ లేక ఇబ్బంది పడుతున్నారా. అయితే శనివారం పూట కష్టపడి పనిచేసే వాళ్లు ఏడు మందికి మీ డబ్బులతో భోజనం పెట్టండి. ఇలా చేస్తే క్రమక్రమంగా డబ్బు నిలబడుతుంది. ఇలా ఏడు శనివారాలు చేసి చూడండి ఏడు శనివారాలు పూర్తయ్యేసరికి మీకు క్రమక్రమంగా డబ్బు నిలబడుతుంది. డబ్బుకు స్థిరత్వం ఉంటుంది ఖర్చులు అనేటటువంటి తగ్గిపోతాయి. అలాగే విపరీతంగా ధన ఆగమనం పెరగాలంటే ఇంకొక శక్తివంతమైనటువంటి ధనదాయక మహిమను పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ ధనదాయక మహిమ ఏంటంటే శనివారం రోజు మీ ఇంటి గుమ్మం ముందు ప్రమిదలో ఆవనూనె పోయండి ఆవనూనె పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపం కొండెక్కిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆవనూనె ఏదైతే ఉంటుందో ఆ ఆవనూనెను సాయంకాలం పూట మీకు దగ్గరలో ఉన్నటువంటి. రావి చెట్టు దగ్గర పోయండి ఇలా 8 శనివారాలు చేయండి.

ఉదయం పూట గుమ్మం ముందు ప్రమిదలో ఆవనూనె పోయటం దీపం పెట్టడం. ఆ దీపం కొండెక్కా కొద్దిగా ఆయన ఆవను మిగులు ఉంటుంది. కదా ఆ మిగిలిన ఆవను నేను సాయంకాలం పూట సూర్యాస్తమయం సమయంలో రావి చెట్టు దగ్గర పోసి రావటం. ఇలా ఎనిమిది శనివారాలు చేస్తే మీకు ధన ఆగమనమనేది పెరుగుతుంది ఒకవేళ నూనె మిగలకపోయినా పర్వాలేదు. దీపం కొండెక్కాక నూనె మిగలకపోయినా కూడా ఎనిమిది శనివారాలు ఇలా ఇంటి ముందు ఆవనూనెతో దీపం పెట్టడం. ద్వారా కూడా ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని. పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది.

Read Also : Lakshmi Kataksham : లక్ష్మీ కటాక్షం సంబంధించిన శక్తివంతమైన పరిహారం…

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Leave a Comment