remedy for pimples acne : మెటిమల సమస్యతో బాధపడుతున్నారా? ముఖం మెటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో మీ చర్మం జిడ్డుగా ఉంటే మెటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా మెటిమలకు కారణమని తెలుసా?
చర్మం పొడిబారినవారిలో మెటిమల సమస్య అధికంగా ఉంటుంది. చర్మంపై మెటిమలు రాలిపోయి అందంగా మెరిసిపోవాలంటే అద్భుతమైన చిట్కాలు ఎన్నో ఉన్నాయి. అందులో మాయిశ్చరైజర్లు మంచి ఉపశమనం అందిస్తాయి. కెమికల్ కంటే నేచరుల్ మాయిశ్చరైజర్లను వాడటం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చునని అంటున్నారు చర్మ నిపుణులు.
Ayurvedic Remedies : వాసనను కోల్పోయారా ? ఈ ఆయుర్వేద చిట్కాలను ఓసారి ట్రై చేసి చూడండి
చర్మం పొడిబారడం కారణంగా ముఖ చర్మంపై మొటిమలు వస్తుంటాయి. పొడి చర్మం నివారణ కోసం మాయిశ్చరైజర్ తరచూ రాస్తుండాలి. ఈ అద్భుతమైన నేచరుల్ మాయిశ్చరైజర్ను తయారుచేసుకోండి. . సూపర్ స్కిన్ ఫుడ్ మీ చర్మాన్ని నిమిషాల్లో మృదువుగా చేస్తుంది. మెటిమలను సమస్య తగ్గించే ఎన్నో టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి.
అందులో మాయిశ్చరైజర్ ఒకటి.. ఇది మీ చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. చర్మం ఎప్పుడూ తేమగా ఉండేలా చేస్తుంది. నల్లబడిన చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. చర్మంపై రంగు కూడా తెల్లగా మారుతుంది. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను సైతం తొలగిస్తుంది. చర్మ రంద్రాలు తెరుచుకోవడమే కాదు.. రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
చాలామందిలో చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా మెటిమలతో ఈ నల్లటి మచ్చల సమస్య అధికంగా ఉంటుంది. మెటిమలను గోరుతో గిల్లకూడదు. అలా చేయడం ద్వారా మెటిమలు మరింత రెచ్చి పుండులా మారే అవకాశం ఉంది. తద్వారా మెటిమలు మానిన తర్వాత మచ్చలా ఏర్పడతాయి.
Dangerous Zodiac Signs : ఈ రాశి మీదేనా? వీరికి హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వస్తాయట.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి
ఒకసారి చర్మంపై మచ్చ ఏర్పడిందంటే అది పోవడం కష్టం.. చర్మంపై మచ్చ ఎన్ని లేయర్ల వరకు లోతుగా ఉందో పరిశీలించాలి. మచ్చ పడినా తర్వాత అది పూర్తిగా శరీరంలో కలిసిపోవాలంటే చాలా సమయం పడుతుంది. అప్పటివరకూ అవసరమైన క్రీములను అప్లయ్ చేస్తూనే ఉండాలి.
ఫెయిర్నెస్ మాస్క్ చర్మం తెల్లబడేలా చేస్తుంది. చర్మం రంగు కంటే నాణ్యత మెరుగుపడుతుంది. నల్లటి వలయాలతో బాధపడుతున్నారా? అయితే వీటిని తగ్గించడానికి బాదం నూనె, బొప్పాయి గుజ్జును కళ్ళ చుట్టూ మసాజ్ చేయడం ద్వారా వలయాలను పూర్తిగా మాయం చేసుకోవచ్చు.
1. ద్రాక్షతో ఫేస్ మాస్క్ :
కొన్ని తాజా ద్రాక్షలను తీసుకోండి. మీకు సులభమైన ముఖ ప్రక్షాళన వచ్చింది. రెండు లేదా మూడు ద్రాక్షలను సగానికి కట్ చేయండి. మీ ముఖం, మెడపై మృదువుగా రుద్దాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
పుల్లటి ద్రాక్ష పండ్లు చర్మంపై ఫేస్ మాస్క్ లా అద్భుతంగా పనిచేస్తాయి. ద్రాక్షపళ్లను కట్ చేసి అందులోని గుజ్జును ముఖంపై అప్లయ్ చేయాలి. మెటమలతో నల్లగా మారిన భాగంపై బాగా రుద్దాలి. అలా చేస్తూ ఉంటే.. క్రమంగా మెటిమల తాలుకూ మచ్చలు తగ్గిపోతాయి. మీ చర్మం రంగులోకి మారిపోతాయి.
2. దోసకాయ ఫేస్ మాస్క్ :
మీ కళ్ళపై దోసకాయ ముక్కలు పెట్టుకున్నారా? దోసకాయలు చర్మంపై రిలాక్స్ ఇస్తాయి. వాపు, నొప్పిని తగ్గిస్తాయి. మొటిమల మంట నుండి ఉపశమనం పొందవచ్చు. దోసకాయ మాస్క్ ద్వారా మీ చర్మాన్ని మృదువుగా చేయొచ్చు.
First Night Milk Secret : ఫస్ట్నైట్ రోజు పాలే ఎందుకు తాగాలి.. అందులో ఉన్న సీక్రెట్ ఏంటి?
మొత్తం దోసకాయలోని నీటిని వడకట్టి, టేబుల్ స్పూన్ చక్కెర వేసి బాగా కలపండి. మీ ముఖానికి ఈ మిశ్రమాన్ని అప్లయ్ చేసిన తర్వాత పది నిమిషాల పాటు ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. అంతే.. మీ చర్మం అందంగా అద్దంలా మెరిసిపోతుంది. చర్మంపై మృతకణాలు తొలిగిపోయి మృదువుగా మారుతుంది.
4. హనీ మాస్క్ :
తేనెలో అనేక మంచి లక్షణాలు ఉన్నాయి. దీనిని సహజ దగ్గు సిరప్గా ఉపయోగిస్తారు. గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. గాయాల ఇన్ఫెక్షన్లను నయం చేయవచ్చు. మొటిమల పెరుగుదలను నిరోధిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తేనె రాసి చర్మంపై 30 నిమిషాలు ఉంచండి. తేనెను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. తేనెలో అద్భుతమైన గుణాలు ఉన్నాయి.
Ayurveda Diet Tips : అధిక బరువు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!
ఇది చర్మంపై దద్దులు లేదా కాలినప్పుడు రాయడం వల్ల మంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మంపై తేనె రాస్తే వెంట్రుకలు తెల్లగా మారుతాయనే అపోహ ఉంది. అందులో ఏమాత్రం నిజం లేదంటున్నారు చర్మ నిపుణులు. తేనెతో చర్మపు ఆరోగ్యం మంచిగా మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. ముఖంపై తేనెను మాస్క్ మాదిరిగా అప్లయ్ చేసుకోవాలి. కొంతసేపు ఆరిన తర్వాత శుభ్రంగా కడిగేయాలి. అప్పుడు మీ చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. మెటిమల మచ్చలు కూడా క్రమంగా తగ్గిపోతాయి.
5. జిడ్డుగల చర్మంపై పెరుగు మాస్క్ :
పెరుగు లాంటి పులియబెట్టిన పాల ఉత్పత్తులు చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయని సూచించాయి. పెరుగు కూడా ప్రోబయోటిక్.. మొటిమలను నిరోధిస్తుందని తేలింది. మాస్క్ చేయడానికి 1 స్పూన్ బ్రూవర్ ఈస్ట్ కొద్దిగా సాదా పెరుగుతో కలిపి సన్నని మిశ్రమాన్ని తయారుచేయండి. జిడ్డుగల చర్మంపై అప్లై చేసి 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచండి.
గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఆ తరువాత చల్లటి నీటితో కడిగేయండి. జిడ్డు చర్మానికి గడ్డ పెరుగు మాస్క్ బాగా పనిచేస్తుంది. పెరుగు మిశ్రమాన్ని ముఖంపై మాస్క్ మాదిరిగా అప్లయ్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. మెటిమలను నిరోధించడంలో పెరుగుతో మంచి ప్రయోజనం పొందవచ్చు.
6. పసుపు ఫేస్ మాస్క్ :
1/2 కప్పు చిక్పా పిండి, 2 స్పూన్ల పసుపు పొడి, గంధపు పొడి, నెయ్యి లేదా బాదం నూనె కలపండి. అనంతరం ఆ మిశ్రమానికి తగినంత స్థాయిలో నీటిని కలపాలి. పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి. అలా ఐదు నుంచి పది నిమిషాల వరకు వదిలివేయాలి. పేస్ట్లను తొలగించడానికి అరచేతులు వేళ్ళతో రుద్దండి నీటితో బాగా కడిగేయండి.
యాంటిబయాటిక్ గుణాలు కలిగిన పసుపును ముఖంపై అప్లయ్ చేయడం ద్వారా మెటిమల సమస్యను తగ్గించుకోవచ్చు. మెటిమల మచ్చలను తగ్గించుకోవాలంటే పసుపును ఫేస్ మాస్క్ లా అప్లయ్ చేసుకోవాలి. ముఖ చర్మం మృదువుగా మారి అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది.
Best Yoga Poses : అధిక బరువు తగ్గాలంటే ఈ యోగాసనాలు బాగా పనిచేస్తాయి ? ఏ సమయంలో మంచిదంటే?