Thummi Chettu : ఇప్పటిలాగా ఒకప్పుడు ఇంగ్లిష్ మెడిసిన్స్ లేవు. మన పూర్వీకులు ప్రకృతిలో లభించే మొక్కలు, ఆకుల ద్వారానే తమకు ఏదేని గాయం అయినా నొప్పి అయినా నయం చేసుకునే వారు. అలా వారు ఆరోగ్యంగానే ఉండేవారు. ఇప్పుడు ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని రకాల నొప్పులు చేయడం అంత ఈజీ అవడం లేదు. కాగా, దివ్య ఔషధంగా మాత్రమే కాకుండా సర్వరోగ నివారణిగా భావించే తుమ్మి మొక్క గురించి తెలుసుకుందాం.
వానాకాలంలో ఎక్కువగా ఈ తుమ్మి మొక్కలు కనబడుతాయని పెద్దలు చెప్తున్నారు. ఆ కాలంలో ఇవి ఎక్కువగా చిగురిస్తాయని వివరిస్తున్నారు. ఈ తుమ్మి మొక్క ఆకులు ఔషధంగా పని చేస్తాయట. ఈ ఆకులను కూరగా వండుకుని తింటే బోలెడు ప్రయోజనాలున్నాయి. కరోనా నేపథ్యంలో చాలా మంది ఇమ్యూనిటీ పవర్ లేక ప్రాణాలు కోల్పోయారు. కాగా, తుమ్మి మొక్క ఆకులను కూరగా వండుకుని తింటే ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుందట. అది మాత్రమే కాకుండా పక్షవాతం వచ్చిన వారు కోలుకుంటారని అంటున్నరు పెద్దలు. పూర్వం తుమ్మి మొక్క ఆకులను పలు రకాల వ్యాధులను నయం చేసేందుకుగాను ఉపయెగించేవారని వివరిస్తున్నారు.
తేలు కుట్టినపుడు తుమ్మి ఆకు రసాన్ని తేలు కుట్టిన ప్రదేశంలో పోస్తే కనుక విష ప్రభావం తగ్గుతుందట. అలా పోసిన తర్వాత నూరిన రసం అక్కడే కొంత ఉంచి కట్టు కట్టాలట. అలా కట్టిన తర్వాత తుమ్మి ఆకు రసాన్ని రెండు చెంచలు సదరు వ్యక్తికి తాగించడం ద్వారా విషప్రభావం తగ్గిపోతుందట. పాము కరిచిన చోట కూడా తుమ్మి ఆకుల రసాన్ని పైపూతగా పూయడం ద్వారా విష ప్రభావం తగ్గిపోతుందని పెద్దలు అంటున్నారు. పూర్వం అలానే చేసేవారని పేర్కొంటున్నారు. ఇకపోతే మార్నింగ్, ఈవినింగ్ టైమ్స్లో తుమ్మి ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా కొద్ది రోజులు తీసుకుంటే ఎంతటి ఫీవర్ అయినా వెంటనే తగ్గిపోతుందట.
Read Also : Ashwagandha : అశ్వగంధతో ఆయుర్వేదంలో ఏయే జబ్బులను నయం చేయవచ్చో తెలుసా?