Spiritual

Masa Shivaratri 2023 : మాసశివరాత్రి రోజు శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఏకకాలంలో పొందడానికి ఈ మహా మంత్రం పఠించండి..

Advertisement

Masa Shivaratri 2023 :  ప్రతిమాసంలో మాసశివరాత్రి రోజున శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఏకకాలంలో పొందడానికి ఆ రోజు ప్రదోషకాలంలో పరమేశ్వరుడు కైలాసంలో ఆనందతాండవం చేస్తూ ఉంటాడు. అయితే, మాస శివరాత్రి రోజు ప్రదోషకాలలో ఆనందతాండవం, కైలాసంలో చేసే పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలతో శివార్చన చేయాలి. ఈ మాసంలో మాస శివరాత్రి రోజున శివార్చన చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా సులభంగా పాత్రులు కావచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం పరమేశ్వరుడి అనుగ్రహం ఏకకాలంలో లభించాలంటే పరమేశ్వరుడికి సంబంధించి ఆగమ శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు ఆ శక్తివంతమైన మంత్రాన్ని చదువుతూ ఆ రోజున సాయంకాలం పూట ప్రదోషకాలంలో అభిషేకం చేయాలి. ఆ శక్తివంతమైన మంత్రం . “శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్య ఈశ్వరాయ నమః “ఇది మంత్రం ఆగమశాస్త్రం పరమేశ్వరుని ఐశ్వర్య ఈశ్వరుడుగా వర్ణించింది.

ఈశ్వరుడు ఇవ్వాలి.. ఇల్లు నిండాలి అన్నట్లుగా పరమేశ్వరుడు ఐశ్వర్య ఈశ్వరుడు కాబట్టి.. ఈ ఐశ్వర్య ఈశ్వరుడికి సంబంధించిన మంత్ర జపం చేస్తూ సాయంకాలం 5:15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో శివాభిషేకం చేస్తే.. దానివల్ల ధనపరమైన సమస్యలని తొలగిపోతాయి. ప్రత్యేకంగా సాయంకాలం ఈరోజు అభిషేకం చేసేటప్పుడు ఆవుపాలతో అభిషేకం చేయటం కొబ్బరినీళ్ళతో అభిషేకం చేయటం, రుద్రాక్ష జలంతో అభిషేకం చేయటం, బిల్వ దళాలు కలిపిన జలంతో అభిషేకం చేయడం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింప చేసుకోవచ్చు. అలాగే, ఈ రోజు సాయంకాలం పూట ప్రదోషకాలంలో ఈ మంత్రం చదువుతూ అభిషేకం చేసిన తర్వాత గంధం రాసిన మారేడు దళాలు పరమేశ్వరుడికి సమర్పించండి గంధం రాసిన మారేడు దళాలు సమర్పించేటప్పుడు కూడా ఈ ఐశ్వర్య ఈశ్వర మంత్రాన్ని చదువుకోవాలి.

Masa Shivaratri 2023 : masik shivaratri benefits in telugu

అభిషేకం చేసేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి. గంధం రాసిన మారేడు దళాలు సమర్పించేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులని తొలగిపోతాయి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అనేక మార్గాలు ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అలాగే, ఈరోజు శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి. అలా వెలిగిస్తే దాంపత్య జీవితంలో ఏర్పడే విభేదాభిప్రాయాలని తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెంచుకోవచ్చు. నమ్మక చమకాలు మొత్తం చదువుతూ శివాభిషేకం చేయలేని వాళ్ళు ఈ ఒక్క ఐశ్వర్య స్వర శివ మంత్రం చదువుతూ శుక్రవారంతో కలిసి వచ్చిన మాస శివరాత్రి సందర్భంగా శివాభిషేకం చేసుకోండి. శివుడు పరమానంద భక్తుడై ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగింపజేస్తాడు. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఆ అనారోగ్య సమస్యలు పోవాలంటే బాలాంబికేశ వైద్యశా భవరోగ్య అనే 3 నామాలు చదువుకుంటూ ఆవు పెరుగుతో శివాభిషేకం చేసుకోండి.

Masa Shivaratri 2023 : మాసశివరాత్రి రోజున ఏ దేవున్ని ఆరాధిస్తే మంచిది? ఏయే ఫలితాలు?

అలాగే, జాతకంలో కాలసర్ప దోషాలు ఉన్నవాళ్లు నాగదోషాలు ఉన్నవాళ్లు కుజ షాలు ఉన్నవాళ్లు పితృ దోషాలు ఉన్నవాళ్లు, ఈ దోషాలు ఏవి జాతకంలో ఉన్న ఆ దోషాల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మాత్రం బొప్పాయి పండ్ల రసంతో ఈరోజు ప్రదోషకాలంలో శివాభిషేకం చేసుకోండి. అలాగే, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవాళ్లు మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్లు ఆత్మవిశ్వాసం తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం వెన్నతో శివాభిషేకం చేసుకోండి. దాని వల్ల విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే, శత్రుభాధలు ఎక్కువగా ఉన్నవాళ్లు కనుదిష్టి ఎక్కువగా ఉన్నవాళ్లు ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేసుకోండి. ద్రాక్ష పండ్ల రసంతో శివాభిషేకం చేసుకోండి. ఇలా మీ సమస్యను బట్టి శివాభిషేకం చేసుకుంటూ ఈ ఐశ్వర్య ఈశ్వర శివ మంత్రాన్ని చదువుకుంటే శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింప చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఏదైనా తీవ్రమైన కష్టం ఎదుర్కొంటున్న వాళ్లు ఆ కష్టం నుంచి బయటపటానికి ప్రదోషకాలంలో 108 ప్రదక్షిణలు శివాలయంలో చేయండి.

అలా చేస్తే, మీరు ఎదుర్కంటున్నటువంటి కష్టానికి ఒక చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. ఈ ప్రత్యేకమైన విధివిధానాలు పాటించండి. అలాగే ఈరోజు పుష్పాలతో శివ పూజ చేసే వాళ్ళు అంటే ఇంట్లో శివలింగం లేని వాళ్ళు ఈశ్వరుడి చిత్రపటానికి పూజ చేసే వాళ్ళు పద్మ పుష్పాలతో గాని గులాబీ పూలతో గాని శివ పూజ చేయండి. పద్మ పుష్పాలు లేదా గులాబీ పూలతో శివ పూజ చేస్తే శివుడు తొందరగా ప్రసన్నడు అవుతాడు. లక్ష్మీదేవి అనుగ్రహం, పరమేశ్వరుడి అనుగ్రహం ఏకకాలంలో పొందటానికి ఈ పుష్పార్చన విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు ఎవరైనా సరే మారేడు దళం మీద దీపారాధన కుందిని ఉంచి అందులో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేసి శివుడి దగ్గర దీపాన్ని వెలిగించండి. అలా చేస్తే శివుడి అనుగ్రహానికి తొందరగా పాత్రులు కావచ్చు. శుక్రవారంతో కూడిన మాస శివరాత్రి కలిసి వచ్చినప్పుడు పరమేశ్వరుడికి పెరుగన్న నైవేద్యం సమర్పించండి. అలాగే, ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం కొబ్బరికాయ ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి.

Read Also : Lakshmi Devi : లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు కనిపించే 4 సంకేతాలు ఇవే..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

3 weeks ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

3 weeks ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

3 weeks ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

5 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

5 months ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

5 months ago