చాలా మంది థైరాయిడ్ సమస్యలతో సతమతమవుతున్నారు.

థైరాయిడ్ సమస్య రావడానికి అధిక బరువు కూడా కారణమవుతున్నదని తెలుస్తోంది.

ఇకపోతే థైరాయిడ్ వలన శరీరంలోని పలు ప్రదేశాల్లో బాగా వాపు వస్తుంటుంది.

ఈ వ్యాధి నుంచి విముక్తి పొందాలంటే ఈ చిట్కాను ఫాలో కావాలి.

ఆయర్వేదం ప్రకారం ధనియాల కషాయం తీసుకుంటే కనుక చక్కటి ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

కషాయం ఎలా తయారుచేయాలంటే.. చెంచడు ధనియాలను అర చెంచడు త్రికటు చూర్ణంతో కలపాలి.

అందులో ఒక గ్లాసెడు వాటర్ మిక్స్ చేయాలి. ఇందుకుగాను ధనియాలను ముందురోజు రాత్రి బాగా దంచాలి. చల్లటి నీటిలో వేసి ఉదయాన్నే వడబోయాలి.

అలా చేసిన తర్వాత వాటిని తాగాలి. ఇలా ప్రతీ రోజు చేస్తే కనుక చక్కటి ప్రయోజనాలుంటాయి.

క్రమం తప్పకుండా ప్రతీ రోజు ధనియాల కషయాన్ని సేవిస్తూ ఉండాలి. అలా చేస్తేనే మీ ఆరోగ్యానికి చక్కటి ప్రయోజనాలుంటాయి.